ఘనంగా సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు

గణపురం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ 78వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ కి భారత ప్రధాని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తృణప్రాయంగా భావించి త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో చైర్పర్సన్ గా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి అందించాలని ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం,ఆకలి చావుల నివారణకు ఆహార భద్రత చట్టం,ప్రజలకు ప్రభుత్వాల మధ్య పారదర్శకత జవాబుదారితనం కోసం సమాచార హక్కు చట్టం,తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎండి.చోటమియా,మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య,మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ,మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున్,మండల యూత్ అధ్యక్షులు పెండ్యాల వెంకటేష్ ముదిరాజ్,సీనియర్ నాయకులు ఓల్లాల సుదర్శన్,గంగాధర్ రావు,నేరెళ్ల రాజు,మార్క కుమార్,పోషాల మహేష్, సీనియర్ నాయకులు ఆలూరి మొగిలి పసునూటి శంకర్, మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే జానీ యూత్ నాయకులు పాష,సమీర్,ఆదిల్, ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version