భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం 44,కార్మిక చట్టాలను4, కో డ్ లగా మార్చడానికి వ్యతిరేకిస్తూ బ్లాక్ డే భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5, ఇంక్లైన్ మొదటి షిఫ్టులో
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో
కార్మికుల నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసన తెలపడం జరిగింది
కేటీకే 5,ఇంక్లైన్ గనిలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ
44 చట్టాలను 4 కోడ్ లగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ “బ్లాక్ డే” గా దేశంలోని అన్నిసంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
కేంధ్రప్రభుత్వం 21 సెప్టెంబర్ పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించచేసుకోవడం దేశంలోని ఆన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని కార్మికుల హక్కులు హరించడానికి కేంధ్రప్రభుత్వం ప్రయత్నింఛడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నల్లబ్యాడ్జీలతో వారు నిరసన తెలిపారు.
అంకెల గ్యారడితో కార్మిక వర్గానికి
అన్యాయం చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు
అదేవిధంగా లాభాలవాటాలో నికరలాభం మీద ఇవ్వాల్సిన 33% లాభాలను సంస్థ అభివృద్ధి కోసం 2200 కోట్లను తీసుకుని కేవలం 2490 కోట్ల రూపాయల వరకే 33% ఇచ్చి సింగరేణి కార్మికులను మోసం చేయడం హేయమని ఈ తతంగం అంతా గుర్తింపు, ప్రాతినిధ్యసంఘాల పుణ్యమేనని గెలిపించిన పాపానికి కార్మికులకు ధ్రోహం చేయడం పాపమని వారన్నారు.
33% లాభాలవాటా రావల్సిన సింగరేణికార్మికులకు 16.9% మాత్రమే వర్తింపచేయడం ఘోరమని వారన్నారు.
సింగరేణి విస్తరణ కోసం బకాయిలు 30 వేల కోట్లు అడగకుండా , మిగిలిన 67% నుండి చేసుకోవాలని చెప్పకుండా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని వారన్నారు. యువకార్మికుల చైతన్యం, ప్రశ్నించేతత్వమే సింగరేణి కార్మికులను కాపాడుతుందని యువతకు భరోసాగా ఎల్లప్పుడూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం (కార్మిక సంఘాల ఐక్యవేదిక ) అండగా ఉంటుందని వారు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో (టి ఎస్ యు ఎస్ ) హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు
కాసర్ల ప్రసాద్ రెడ్డి
ఈ శ్రీధర్
జూపల్లి మల్లేష్
పి చంద్రశేఖర్
వెంకటేష్ సంపత్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.