ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన ఎస్సై తీగల మదన్ గౌడ్

-వాగుల శివారులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా జెసిబితో గుంతలు

-వినూత్న రీతికి శ్రీకారం చుట్టిన ఎస్ఐ మాధవ్ గౌడ్ కు అభినందనల వెల్లువ
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 16
మండలంలోని వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా మొగుళ్లపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అడ్డుకట్ట వేశారు. మండలంలోని వేములపల్లి గ్రామ శివారులోని గల గునకపల్లి, ఇస్సిపేట గ్రామ శివారులోని వాగొడ్డుపల్లి వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ గుర్తించారు. దీంతో వాగుల శివారుల నుండి అక్రమంగా ఇసుక తరలకుండా జెసిబి సహాయంతో వాగుల చుట్టూ గుంతలు తీయించారు. కాగా ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ వినూత్న రీతికి శ్రీకారం చుట్టడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మాట్లాడారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version