ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామల

జిల్లా అధ్యక్షురాలుగా హేమలత, ఉపాధ్యక్షురాలుగా సునంద

జిల్లా కార్యవర్గ సభ్యులుగా హేమంత్ రాజు, మనోహర్ యాదవ్

తిరుపతి,నేటిధాత్రి:

రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధిగా శ్యామల,తిరుపతి జిల్లా అధ్యక్షులుగా హేమలత, ఉపాధ్యక్షురాలుగా సునంద, కార్యవర్గ సభ్యులుగా హేమంత్ రాజు,మద్దు మనోహర్ యాదవ్ లను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు, యువ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సంగరాజు అశ్విని, ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్ రాజు, వీరనాగమల్లయ్య తెలిపారు.స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ శరన్ దాస్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా), జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల లచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యంలో రామ రాజ్య స్థాపన కోసం, సనాతన హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను మార్చి మాసంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామ రాజ్య స్థాపనే ఎజెండాగా ఏర్పాటైన ఆర్ హెచ్ వి ఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. మార్చిలో తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లతోపాటు శ్రీలంక,మారిషస్ ప్రధానులు, నేపాల్ కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అనిత దేవి సాహూ,తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంగా జనవరి 19న డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించనున్నట్లు రుద్రరాజు శ్రీదేవి రాజు తెలిపారు.జిల్లా అధ్యక్షురాలు హేమలత,రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల,రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరనాగమల్లయ్యమాట్లాడుతూ హైందవ ధర్మం కోసం,ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహా యజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తివంచన లేకుండా ఆర్ హెచ్ వి ఎస్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో సీతా సమేత శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు రాష్ట్ర అధికారప్రతినిధి శ్యామల, అధ్యక్షురాలు హేమలత తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతా నికి ఇప్పటినుంచి ప్రణాళికాబద్దం గా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు,తమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర శుక్ల,దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు,ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి రాజు,యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సంగరాజు అశ్విని,ఉపాధ్యక్షులు వీరనాగ మల్లయ్య,సిరిగిరి శంకర్ రాజులకు అభినందనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version