యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి
చౌటుప్పల్:శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటిరోజు పూజా కార్యక్రమం శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు పూజలు అందుకున్నారు. ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించిన భక్తులు శ్రీ దుర్గా మాత విగ్రహ దాతలు పురపాలక చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు వేద మంత్రోచ్ఛారణలతో దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ పెద్ది సుధాకర్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ శ్రీలత దంపతులు, బొబ్బిళ్ళ మురళి సంధ్యా దంపతులు, మోగదాల రమేష్ గౌడ్ సాహితి దంపతులు, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, పోలోజు శ్రీలత శ్రీనివాస్ దంపతులు, తూర్పాటి నరసింహ, బొడిగె బాలకృష్ణ గౌడ్, పోలోజు శ్రీధర్ బాబు, ఉప్పల కృష్ణ కుసుమ దంపతులు తదితర భక్తులు పాల్గొన్నారు.