శివ కళ్యాణ ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే గండ్రకు అందజేత

చారిత్రక కట్టడాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

కోటగుళ్ళు అభివృద్ధికి కృషి చేస్తాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

చారిత్రక కట్టడాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అందులో భాగంగా గణపురం కోటగుళ్ళు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కోటగుళ్ళలో నిర్వహించనున్న శివ కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పత్రికను పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కు అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోనే ఏకైక కాకతీయుల కట్టడమైన కోటగుళ్ళ కు నిధులు కేటాయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాజర్ల అశోక్ గౌడ్,అప్పం కిషన్, లింగంపల్లి వేణురావు, ఆలయ అర్చకులు నరేష్, పరిరక్షణ కమిటీ సభ్యులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, పావుశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *