మందమర్రి నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన శశిధర్

రామకృష్ణాపూర్ (మందమర్రి), మార్చ్ 02, నేటిధాత్రి:

మందమర్రి సర్కిల్ నూతన సిఐగా శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పోలీస్ శాఖ చేపట్టిన బదిలీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట సర్కిల్ నుండి ఆయన మందమర్రి సర్కిల్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ మాట్లాడుతూ….శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అన్నారు.మందమర్రి సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. నూతనంగా సిఐ బాధ్యతలు చేపట్టిన శశిధరకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version