గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

కళాశాల ప్రిన్సిపాల్: డాక్టర్ గోలి శ్రీలత

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల వరంగల్ వెస్ట్ నందు సావిత్రిబాయి పూలే 194 వ జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ,వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గురించి వారి జీవిత విశేషాలను ఎంతో చక్కగా వివరించారు. అలాగే కళాశాల అధ్యాపకులు డాక్టర్ సాంబలక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఏ విధంగా కృషి చేశారో వివరించారు. డాక్టర్ రాధిక గారు సావిత్రిబాయి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ మాలతి గారు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఓర్చుకొని నిస్వార్థ సేవ చేసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఉండడం మనకు గర్వకారణం అని, అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈరోజును (3 జనవరి)మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించడం ఎంతో ఆనందదాయకమని వివరించారు. అలాగే రామకృష్ణ పరమహంస వంటి నిరంతర సామాజిక సేవాభావం కలిగిన మహానుభావులు చెప్పినటువంటి సమదృష్టి గురించి కొన్ని కథలను విద్యార్థులకు వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సీనియర్ ఫ్యాకల్టీ భద్రకాళి మేడం ,డాక్టర్ జక్కె పద్మ, జ్యోతి డాక్టర్ సాంబలక్ష్మి, డాక్టర్ రాధిక ,డాక్టర్ విమల మరియు విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత ఒక ప్రకటనలో తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version