చందుర్తి, నేటిధాత్రి:
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో ఉన్న సమ్మక్క సారలమ్మ ఆలయం నందు శనివారం రోజున బోనాలు మరియు అన్నదాన కార్యక్రమం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చందుర్తి మండలం లోని ఏకైక దేవాలయం అయినటువంటి సమ్మక్క సారక్క జాతరకు చందుర్తి మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు మరియు మల్యాల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.