డి సి సి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ సాగర్ రావు ని కలిసిన శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు

మంచిర్యాల నేటిదాత్రి

తమ సమస్యలు పరిష్కరించాలని డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కలిసి తమ సమస్యలను తెలియజేశారు శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కార్మికులకు రావాల్సిన ఎలాంటి హక్కులు గ్రాడ్యుటి చెల్లించకుండా నిర్ధాక్షణంగా కార్మికులను రోడ్డుపాలు చేశారని వారికి రావాల్సిన హక్కులను తోరతగతిన యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని యజమాన్యం వహిస్తున్న మొండి వైఖరి వలన కార్మికులు రోడ్డుపాలైనారని తమ కుటుంబాలను చూసుకోవడం కష్టతరంగా మారిందని వారి పోషణ భారం అవుతుందని వెంటనే స్పందించి యజమాన్యంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ని కార్మికులు కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో బిఎంఎస్ అధ్యక్షుడు కుంటాల శంకర్ ఉపాధ్యక్షులు సాగుర్తి ఆనంద రావు కాయితి శ్రీనివాస్ కోశాధికారి పెంట సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు అసారి ఓదెలు బొలిశెట్టి తిరుపతి డి మల్లయ్య కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!