భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐ టి సి రా మెటీరియల్ సి సి ఏ ఆఫీస్ నందు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట్ పుల్లయ్య భద్రతా నియమాల పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన ఐటీసీ అధికారులు .తొలత మొక్కలు నాటి మొక్కలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక్క మొక్కను ప్రతి ఒక్కరు నాటాలని పిలుపునిచ్చారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి ప్రాణం ఎంతో ముఖ్యమైనదని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా భద్రత నియమాలు పాటించాలని అప్పుడే ప్రమాదాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా సర్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి భద్రత ఏ విధంగా పాటించాలో వివరించారు. ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్టు హెల్మెట్ నియ మనిబంధనలు ఆచరించాలని అప్పుడే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని సూచించారు.