వేములవాడ రూరల్ నేటిదాత్రి
వేములవాడ రూరల్ మండలం లోని మర్రిపల్లి గ్రామంలో జగిత్యాల జిల్లా పొలాసా వ్యవసాయ కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టారు స్థానిక రైతువేదిక కేంద్రంలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనం కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా సామాజిక వనరులు ప్రిఫరెన్స్ ర్యాంకింగ్ సమస్యల చెట్టు మాట్రిక్స్ ర్యాంకింగ్ కాలానుగుణ పట్టిక తదితర అంశాలపై ముగ్గుల తో చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లు అనూష సందీప్ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు మానస వేక్షిత దివ్య రచన గ్రామస్తులు కోడూరు దేవయ్య పరుశరాములు లక్కం తిరుపతి శేఖర్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు