రేవంత్ పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి మండల పార్టీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ,
రేవంత్ రెడ్డి నీ జీవితం ఎలా మొదలైందో నీ చరిత్ర నాకు తెలుసు. మీ సోదరుల్లో ఒకరు కానిస్టేబుల్, ఇంకొకరు అటెండర్ నువ్వు అడ్వర్ టైజ్ మెంట్ పోస్టర్లు వేసుకునేవాడివి, డబ్బున్న ఒక అమ్మాయిని బోల్తా వేసి పెళ్లి చేసుకున్నావు. రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. దొరికిన దొంగ రేవంత్ నాపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్ర ద్రోహి, నమ్మక ద్రోహి వి నువ్వు. అన్ని పార్టీలను మోసం చేసి, నాశనం చేసింది నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనీ కూడా మోసం చేసేది నువ్వే, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకున్నది నువ్వు
అందుకే మీ లీడర్లే నీ పేరును రేటెంత రెడ్డి గా మార్చారు. మాది తాతల తండ్రుల నుంచి వేల ఎకరాలు ఉన్న కుటుంబం
మొన్ననే 250 ఎకరాలు రామచంద్ర మిషన్ కు గిఫ్ట్ గా ఇచ్చాను. రేవంత్ రెడ్డి నువ్వొక బ్రోకర్, జోకర్వీ, టిడిపిలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఐటెం సాంగ్ లాంటి వాడని చంద్రబాబు కు చెప్పాను. రేవంత్ రెడ్డి నీది బ్లాక్ మెయిలింగ్ చరిత్ర కాదా ఓటమి ఎరుగని నాయకుడిని నేను. సీఎం కేసిఆర్ తర్వాత వరుసగా గెల్చిన నాయకుడిని నేను. సొంత నియోజకవర్గంలో నిలబడి గెలవలేక మల్కాజ్ గిరిలో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ చాలు అన్నావు. నీకు సిగ్గుందా డీకే శివ కుమార్ కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని ఒప్పుకున్నాడు. అక్కడ కరెంట్ ఇవ్వలేని వాళ్లు ఇక్కడ ఎలా ఇస్తారు. రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి 10 కోట్లకు సీట్లను అమ్ముకున్నారు రేవంత్ రెడ్డి నీవు బ్రోకర్ మనిషివి బెదిరించి భూములు కాజేసిన వ్యక్తిని
ఓటుకు నోటు కేసులో జైలు నుంచి బయటకు వచ్చి నా కాళ్ళు మొక్కాడు. నీలా నీతిగా ఉంటే మంచిగా ఉండదని నువ్వు చెప్పలేదా రాజకీయంగా ఎదగరని చెప్పింది నిజం కాదా, పాలకుర్తి ప్రజలు నన్ను వదిలి పెట్టరు
పాలకుర్తిలో లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు నా వెంట ప్రజలు ఉన్నారు రేవంత్ హెలికాప్టర్ లో వచ్చాడు. రోడ్డు మీద వస్తే నేను చేసిన పనులు కనిపిస్తాయి. హెలికాప్టర్ నుంచి చూసినా అభివృద్ధి కనిపిస్తుంది
ఎంతో మంది కరోనా రోగులను బతికించాను. మహిళల కోసం రూ. 10 కోట్లను ఖర్చు చేశాను. 22 వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్ లు ఇచ్చాను. నా జీవితాంతం ప్రజలకు సేవ చేస్తా, పాలకుర్తి ప్రజలను, కార్యకర్తలను తన్నింది నిజం కాదా. కాంగ్రెస్ పార్టీని తన్నాలి. అలాంటి నాయకులను దగ్గరికి రానీయొద్దు మన ప్రజలను అవమానపరిచిన వాళ్లపై చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలా తిరగబడాలి
నాంచారిమడూరులో కాంగ్రెస్ నాయకుల వాహనం ఢీకొని చనిపోయిన వ్యక్తికి సంభందించి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నన్ను వంచించాడు. మభ్య పెట్టి రూ.10 కోట్లకు పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ ను ఝాన్సీ రెడ్డికి అమ్ముకున్నాడు. నేను కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేకిని రేవంత్ రెడ్డి కోసమే ఆ పార్టీలో చేరాను. మొదటి నుంచి నాకు పాలకుర్తి టికెట్ ఇస్తామని నమ్మించాడు. అనేక స్టోరీలు అల్లి నన్ను మోసం చేశాడు
ఝాన్సీ రెడ్డి ని రేవంత్కు పరిచయం చేసిందే నేను ఝాన్సీ రెడ్డి వి అబద్ధపు మాటలు అక్రమ వ్యాపారాలు
ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం లేదు ఆమె కోడలు యశస్విని రెడ్డికి వారసత్వం లేదు. తనకు పౌరసత్వం లేకున్నా ఉన్నదని పాలకుర్తి ప్రజలను ఝాన్సీ రెడ్డి మోసం చేసింది. యశస్విని పాలమూరు బిడ్డ పాలకుర్తి కోడలు కాదు ఆమె అమెరికా కోడలు. కార్యకర్తలు కాలుతో తన్నిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు ఎట్లా ఎన్నుకుంటారు. పాలకుర్తిలో కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించాలి ఈ మీడియా సమావేశంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version