సర్పంచ్,పాలకవర్గం పదవి విరమణ కార్యక్రమం

నడికూడ,నేటి ధాత్రి:

మండల కేంద్రంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు నేటితో 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సర్పంచ్ ఊర రవీందర్ రావు,ఉప సర్పంచ్ కిన్నెర మని,వార్డు సభ్యుల పాలకవర్గ పదవి విరమణ కార్యక్రమం జరిగింది.పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటినుండి పదవి విరమణ వరకు ప్రజాసేవే పరమావధిగా అండగా ఉండి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉన్నానని ప్రజల సహకారంతో, పాలకవర్గం అండదండలతో, గ్రామాన్ని అభివృద్ధి దిశ లో ఉంచానని ప్రభుత్వ ఆదేశానుసారం పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం,అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, వై కుంట ధామం, మన ఊరు మన బడి ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు నా హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు,సమావేశ అనంతరం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,ఎంపీటీసీ అప్పం చేరాలు,పంచాయతీ కార్యదర్శి సందీప్,ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, బిఆర్ఏస్ నాయకులు సంఘని వేణు,మల్లారెడ్డి,పిఎసిఎస్ డైరెక్టర్ ఊర సతీష్ రావు,గోడిశాల రంజిత్ కుమార్,మొర్రి సారయ్య, పిడుగు రమేష్,తాళ్ల రవి, వంశీ,ఎలకంటి రాజు,దుప్పటి మొగిలి,రమేష్,నెవరు గొమ్ముల ప్రభాకర్ రావు,నీరటి రాములు, గొనెల శరత్,రావుల కిషన్, కొక్కిరాల శ్రీధర్,తిరుపతి,ఊర శ్రీనివాస్,రేవంత్,ప్రశాంత్, శ్రీకాంత్,అఖిల్,లడ్డు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version