తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కన్వీనర్ డా.బండారి దేవేందర్
రేగొండ, నేటిధాత్రి:
రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చెప్పట్టేందుకు అసెంబ్లీలో తీర్మానించడం హర్షనియమని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కన్వీనర్ డా. బండారి దేవేందర్ అన్నారు.ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ 1931 నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా బీసీ కులగణన చెయ్యకపోవడం వల్ల బీసీలు ఉపాధి, విద్యా, రాజకీయ, వివిధ రంగాలలో తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు.పశువులకు, పక్షులకు లెక్కలు తీసుకున్న గత ప్రభుత్వాలు మనుషులను కులాల వారిగా లెక్కించడంలో మీన వేశాలు వేశారన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే, అధికారంలోకి వచ్చాక నిన్న అసెంబ్లీలో కులగణన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టితే ఏకగ్రీవంగా ఆమోదించడం సంతోషమన్నారు.త్వరలోనే కులగణన పూర్తిస్థాయిలో చేసి అన్ని కులాల వారిగా లెక్కలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు బోయిన వినోద్ కుమార్ యాదవ్,వావిలాల రమేష్,చరణ్,రాజు తదితరులు పాల్గొన్నారు.