ప్రభుత్య విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం లోని శెట్టిపల్లి గ్రామం నుండి కుంజవారి గుంపు వరకు ఎస్టీఎస్ డిఎఫ్ నిధులతో సుమారు 1 కోటి 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ప్రభుత్య జూనియర్ కళాశాల ప్రహరీ గోడ శంకుస్థాపన
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రహరీ గోడ నిర్మాణం మరియు పలు అభివృద్ధి పనుల కోసం సుమారు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన నారం రెడ్డి సూర్య దేవి కుటుంబ సభ్యులను పరామర్శ
శెట్టిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నారం రెడ్డి రవీందర్ రెడ్డి పెద్దమ్మ సూర్యదేవి ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తి లింగయ్య ను పరామర్శ
గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తీ లింగయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.