రాకేష్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి

విద్యావంతులైన యువత కు సేవ చేసే అవకాశం కల్పించండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల పట్టణ బిఆర్ఎస్ ఇంచార్జి ఇంగిలి వీరేష్ రావు

పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల పట్టణ ఇంచార్జి ఇంగిలి వీరేష్ రావు అన్నారు.శుక్రవారం ఆయన పరకాల పట్టణంలోని పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా విద్యావంతుడు,యువకుడైన ఏనుగుల రాకేష్ రెడ్డికి పట్టభద్రులంత మద్దతు ఇవ్వాలని కోరారు.ప్రజాసేవ లక్ష్యంగా రాకేష్ రెడ్డి గత 13 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారని కాంగ్రెస్,బీజేపీ పార్టీల అభ్యర్థులు చీటర్ లు,మోసగాళ్లని ప్రజల పేరు పార్టీల పేరు చెప్పుకొని అక్రమంగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యం తప్ప ప్రజలకు ఏనాడూ రూపాయి సహాయం చేసింది లేదన్నారు.రాకేష్ రెడ్డి సొంతగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారని కరోనా లాంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేశారని తెలిపారు.విద్యవంతుడైన రాకేష్ రెడ్డి ని గెలిపించడం ద్వారా నిరుద్యోగుల,పట్టభద్రుల గొంతై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.పట్టభద్రులంత మూడో క్రమ సంఖ్యలో మొదటి ప్రాధాన్యత వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జి లు,బొచ్చు బాబురావు,హమీద్,బండి రమేష్ గౌడ్,తదితర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version