రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చేది లేదు.

అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యం

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని వంగపహడ్, హాసన్ పర్తి లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మీరు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయాలని
వరంగల్ పార్లమెంట్ సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాను. గత పది సంవత్సరాల మోడీ పాలనలో శాంతి నెలకొంది.
మోడీ ప్రభుత్వంలో నాలాంటి వాళ్ళు ఎంపి గా ఉంటే మీ సమస్యలు అన్నీ తిరుతాయి అని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మోడీ వరంగల్ లో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. పేద వర్గాల సమస్యలు తెలిసిన వాడిని కేంద్రంలో కూడా పేదరికం నుండి వచ్చిన బిసి బిడ్డ ప్రధాన మంత్రిగా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కారం చూపించగలగే సత్తా ఉన్న పార్టీ బిజెపి మాత్రమే
నేను వరంగల్ ప్రజలకు కొత్త ఏమీ కాదు కులంతో, మతం తో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు
ఇక కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ప్రజలకు పెద్దగా తెలియదు
కాంగ్రెస్ నుండి వచ్చే వ్యక్తి కడియం శ్రీహరి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తుంది. కడియం శ్రీహరి నే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఆయన కూతురు ని ఎలా నమ్ముతారు?
కడియం కావ్య ను సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి మనిషి అని అంగీకరించడం లేదు ఎందుకంటే మళ్లీ ఎప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్తారో అనే భయం ఉంది
నా వ్యక్తిత్వం దెబ్బతిసే విధంగా మాట్లాడే కడియం శ్రీహరి కి పుట్టగతులు ఉండవు ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి చరిత్ర కంచికె ఇన్ని రోజులు ప్రజలను ప్రలోభాలకు గురి చేసి గద్దె మీద కూర్చునావ్ ఇప్పుడు అదే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్దంగా ఉన్నారన్నారు.
రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారైంది.
ప్రజలకు మంచి చేయమని కాంగ్రెస్ కి పట్టం కడితే హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుండు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే కనిపిస్తోంది.
నన్ను ఓడించడం కొరకు ఎన్ని కుట్రలు చేశారో మీ అందరికీ తెలుసు.
మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న వాడిని నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలుసు
మీ అందరికీ సేవ చేయడం కోసం బిజెపి పార్టీ నాకూ ఎంపి అభ్యర్థిగా బిజెపి అవకాశం కల్పించింది.
నన్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీదే.
వర్ధన్నపేటలో 2014,2018 ఎన్నికల్లో నాకూ ఇచ్చిన మెజారిటీ మళ్లీ తిరిగరాయలన్నారు.
ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మరావు, రాష్ర్ట ఎస్సి మోర్చ అధ్యక్షులు కొండేటి శ్రీధర్,హాసన్ పర్తి జెడ్పిటిసి సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, బుద్ధే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version