బల్దియా ఇన్చార్జి కమిషనర్ గా రాధిక గుప్తా

నేటిధాత్రి, వరంగల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమీషనర్ (అదనపు బాధ్యతలు) గా హన్మకొండ జిల్లా (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్ రాధికా గుప్తా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా వ్యక్తిగత కారణాలపై సెలవుపై వెళ్ళడం వలన హన్మకొండ అదనపు కలెక్టర్ కు అదనపు బాధ్యతలు కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ఇన్చార్జి కమీషనర్ ను అదనపు కమీషనర్ లు అనిసుర్ రషీద్, రవీందర్ యాదవ్, పిఆర్ఓ ఆయుబ్ అలీ, డిప్యూటీ కమిషనర్ లు రవీందర్, కృష్ణా రెడ్డి, హార్టికల్చర్ అధికారి రమేష్ తదితర అధికారులు కలిసి పూల మొక్కలు, పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version