పిల్లలు వాహనం నడిపితే తల్లిదండ్రులకు శిక్ష

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2025

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం-2025,సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త ను పురస్కరించుకొని బుధవారం ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞానదీప్ హైస్కూల్ నందు 1400 మంది విద్యార్థులతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు. జిల్లా రవాణా శాఖా అధికారి వి.లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీ ఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ టిఐడిఇఎస్ జిల్లా ప్రిన్సిపల్ దొరయ్ మురుగన్ పాల్గొని పిల్లకు డ్రైవింగ్ ఎవరు చేయాలి ఎలా చేయాలి నియమాలు శిక్ష ల గురించి తెలిపారు.పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత ట్రైనింగ్ ఇనిస్ట్స్టూట్ నందు ట్రైనింగ్ తీసుకోని లైసెన్స్ తీసుకోని డ్రైవింగ్ చేయాలని సూచించారు.మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీదర్ మాట్లాడుతూ పాఠశాల వాహనాల డ్రైవర్లకు బస్సు నడిపే సమయములో తప్పకుండ సహాయక వ్యక్తి ఆధ్వర్యములో బస్సు నడపాలని తాగి డ్రైవింగ్ చేయొద్దని మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడుపొద్దని తెలిపారు.విద్యార్థులతో మాట్లాడుతూ మీరు డ్రైవింగ్ చేస్తే మీ తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాతనే డ్రైవింగ్ నేర్చుకోవాలని తెలిపారు చదువుకునే సమయం చదువుకోసం మిగతా స్కిల్స్ మీద శ్రద్ద వహించాలన్నారు. అనంతరం పిల్లలందరికి పళ్లు పంపిణి చేశారు ఆరువందల మంది విద్యార్థులతో పట్టణములో గొల్లపల్లి బస్టాప్ వరకు స్కౌట్ విద్యార్థులతో
భారీ ప్రమాదాలు నివారించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ వాహనములు నడపమని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మినారాయణ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!