గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం భూపాలపల్లి సిఐగా నూతనంగా నియమితులైన దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్, లక్ష్మీ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారిని సాదరంగా ఆహ్వానించి అర్చన అభిషేకం నిర్వహించిన అనంతరం సీఐ దంపతులను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.