ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి,అభివృద్ధికి పెద్దపీట.

కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ నేటి ధాత్రి

ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి,అభివృద్ధికి పెద్దపీట
వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..శనివారం వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ రూరల్, అర్బన్ మండలాల అర్హులైన 208 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై చెక్కులను మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి తో కలసి పంపిణీ చేశారు..

వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడ్ వల్ల కాస్త ఆలస్యమైందని అన్నారు..

ప్రభుత్వం సామాజిక బాధ్యతగా నిరుపేద బిడ్డలకు వివాహం జరిగినప్పుడు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా కళ్యాణ లక్ష్మి తోడ్పాటునందిస్తాయన్నారు..

సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.. మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు..

ఇండ్లు లేని వారికి త్వరలోనే వాటి నిర్మాణానికి బీసీలకు ఐదు లక్షలు ఇతరులకు ఆరు లక్షల ఇవ్వడం జరుగుతుందన్నారు… వేములవాడ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు కాబడి ఉన్నాయన్నారు..

ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కూడా కొనసాగిస్తామన్నారు.. ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన ప్రజలకు అందిస్తామన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version