రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో నేడు భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఐదు వచ్చినట్లు ఆమె తెలిపారు.వాటిని పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులను అందజేసి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల వివిధ శాఖల అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.