సిడిపిఓ అవంతి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సరైన పోషణ..ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ సిడిపిఓ అవంతి అన్నారు. బుధవారం పోషణ మాసోత్సవాలను పురస్కరించుకొని పర్లపల్లి అంగన్వాడీ సెక్టార్ పరిధిలోని పర్లపల్లి-1 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహార పదార్థాల ప్రదర్శనను నిర్వహించి..వాటి విలువపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ సిడిపిఓ అవంతి మాట్లాడారు. పోషణ లోపం లేకుండా ఉండే రామాలే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఎదుగుదల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తూ..రక్తహీనత..తక్కువ బరువును అరికట్టేందుకు పెద్ద ఎత్తున పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీ మొదటి రోజు నుండి బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు తీసుకోవాల్సిన పోషకాహార పదార్థాలు, తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ప్రతినెల తల్లి, బిడ్డల బరువులు, ఎత్తులు చూసి పోషకాహార లోపం ఉన్న పిల్లలకి వైద్యాధికారుల సూచన మేరకు అదనపు పోషకాహారం అందించి..సాధారణ స్థితికి తేవడంలో అంగన్వాడీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమం అనంతరం బాలింతలు, గర్భిణీ స్త్రీలతో పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని, పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత, హెల్త్ సూపర్వైజర్ జమున, స్కూల్ టీచర్స్, ఆశాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు, సెక్టార్ అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
