దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి: అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, (నేటిధాత్రి)

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో స్పందించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ అన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో
సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 12 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులకు స్పందించి ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూధన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *