ఓట్ల సమయం దగ్గర పడుతుండడంతో జోరందుకున్న ప్రచారం.
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామయంపేట మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించి వెళుతుండగా బి ఆర్ ఎస్ నాయకులు వచ్చి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఎక్కడ చూసినా ఫోటోగా ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు ముమ్మరం చేశాయి. ఏ ఒక్క ఇంటిని వదలకుండా తమదైన శైలిలో తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
