నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, పాఠ్య పుస్తకాలను, యూనిఫాలను వెంటనే అందించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం
అందజేశారు.మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఉపాధ్యాయుల కొరత ఈ సంవత్సరం లేకుండా చూడాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ప్రతి పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ విద్యాశాఖ కార్యాలయంలో అధికారి భరత్ కు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్టాలిన్ సిద్దు శ్రీకాంత్ పాల్గొన్నారు.