వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రదానం

వరంగల్:

Vaibhavalaxmi Shopping Mall

దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్ జెపిఎన్ రోడ్డులో ఉన్న వైభవలక్ష్మి షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

మొదటి బహుమతి విజేత కాశీబుగ్గకు చెందిన జి రోషిణి, కూపన్ నంబర్ బి 373, గల వారికి ఒక కిలో వెండి బహుమతి గెలుచుకున్నారు.

రెండవ బహుమతి విజేత రెడ్డిపాలెంకు చెందిన జి ప్రియాంక కూపన్ నంబర్ జే 250 టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, దసరా పండుగ శుభ సందర్భంలో ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి మూలకారణమని అభినందనలు తెలిపారు.

విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు..

కార్యక్రమంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు, ప్రదీప్, హరీష్, రిషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version