కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమ్మల జాతరకు ప్రభా బండి

జెండా ఊపి ప్రభ బండి ర్యాలీ ప్రారంభించిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ ,నేటి ధాత్రి: నెక్కొండ మండల వ్యాప్తంగా హోలీ పండగను అంబరాన్ని అంటే విధంగా ఎంతో ఆనందోత్సవాలతో ఒకరిపై ఒకరు రంగులు పోల్చుకుంటూ అంగరంగ వైభవంగా నిర్వహించుకోగా హోలీ పండగతో కొమ్మల గ్రామంలో వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి జాతర కొనసాగుతుంటుంది ఈ జాతరకు ముదిగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, నాయకులు కవటి కోటీశ్వర్, భూమని మధు, మట బిక్షపతి,ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రభ బండి ఏర్పాటుచేసి ప్రభ బండికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలతో అలంకరణ చేసి కొమ్మల జాతరకు బండిని అంగరంగ వైభవంగా ఆటపాటలతో ముదిగొండ పలు గ్రామాల ఊరేగింపులతో కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొని జెండా ఊపి కొబ్బరికాయ కొట్టి ప్రభ బండిని కొమ్మల జాతరకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, బండి శివకుమార్, మొహమ్మద్ అన్వర్ పాషా, రావుల మైపాల్ రెడ్డి, మాధవరావు, జక్కుల సమ్మయ్య, కాంగ్రెస్ మండల,గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version