ఖమ్మం నేటి ధాత్రి
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో జరిగే పలు వివాహాది శుభకార్యక్రమాలు, దైవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ అధిక సంఖ్యలో హాజరై ప్రసాద్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.