మహాదేవపూర్ -నేటి ధాత్రి:
మొబైల్ ఫోన్ పోవడంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా సి ఈ ఐ ఆర్ సహాయంతో మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించడం జరిగింది. మండల కేంద్రానికి చెందిన చేపూరి మహేష్ తండ్రి మల్లయ్య డిగ్రీ విద్యార్థి “ఒప్పో ,కంపెనీ ఎఫ్ 23 మోడల్ “తన మొబైల్ ఫోన్ పోవడంతో స్థానిక పోలీస్ అమీన్, పవన్ కుమార్ కు సంప్రదించడం జరిగింది. కానిస్టేబుల్ చంద్రమోహన్ రైటర్ తిరుపతి ,కృషి ఈసీఐఆర్ పోర్టల్ ,ను ఉపయోగించి మొబైల్ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి తిరిగి బాధిత విద్యార్థి మహేష్ కు మొబైల్ ఫోన్ను అప్పగించడం జరిగిందని, అమీన్ కచేరి ప్రకటనలో తెలిపారు.పోగొట్టుకున్న ఫోన్ ను విద్యార్థికి అందించడంతో విద్యార్థి మహేష్ ఎస్సై కుమార్ తో పాటు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.