ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కల్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల టౌన్, పరకాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version