సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

16వ డివిజన్ గరీబ్ నగర్ లో కార్పొరేటర్ పర్యటన.

సమస్యలపై దృష్టి సారించిన స్థానిక కార్పొరేటర్.

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ గరీబ్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ సుంకర మనీషా శివకుమార్ పలు సమస్యలపై పర్యటించడం జరిగింది.గరీబ్ నగర్ లో పారిశుద్ధ్య మరియు వాటర్ సప్లయ్ కి సంబంధించిన పలు సమస్యలపై గ్రామములోని పలు వీధులలో మున్సిపల్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలతో సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పలు వీధులలో పేరుకుపోయిన చెత్తను,మరియు మురుగు కాలువలు శుభ్రం చేయడం లాంటి శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ జవాన్ కు సూచించారు.వాటర్ సప్లయ్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.దోమలు,ఈగలు వ్యాప్తి చెందకుండా వెంట, వెంటనే అర్బన్ మలేరియా సిబ్బంది చే మందులు పిచికారీ చేయడం, నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది అన్నారు.ప్రజలు కూడా స్వీయ పరిశుభ్రత, పరిరక్షణ పాటించాలని కోరారు.ఇంటి ఆవరణ లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పోగుల సంజీవ, స్థానిక నాయకులు బొజ్జం తిరుపతి,రాజారాం, ఎస్ కె అంజాద్,బొంత.రవికుమార్,పూర్ణ, ఆకుల.శ్రీకాంత్,గిరిశెట్టి.అశోక్,మెండు.రామకృష్ణ,మున్సిపల్ జవాన్ రాజేష్,సిబ్బంది,అర్బన్ మలేరియా సిబ్బంది,గరీబ్ నగర్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version