గణపురం మండల ప్రజలు ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాలి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో ఎండలు తీవ్రత ఎక్కువ ఉంటున్నాయని మండల ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని. మంగళవారం రోజున నేటి ధాత్రి తో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్ మాట్లాడుతూ గణపురం మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని మరికొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మరికొన్ని రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలందరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వ్యవసాయదారులు కూలి పని చేసుకునేవారు హమాలి తాపీ మేస్త్రి కార్మికులు ఎండ తీవ్రతను గ్రహించి ఉండాలని ప్రయాణం ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకోవాలని ముఖ్యంగా ముసలి వాళ్లు పిల్లలు ఎండలో తిరగకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వడ దెబ్బ తగలకుండా మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version