కేంద్ర మంత్రులను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇతర ఎంపీలతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,నితిన్ గడ్కరీ,మరియు ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.కిషన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రంలో కొత్త మైనింగ్ అనుమతులు,గనుల నిర్వహణ,పర్యావరణ అనుమతులు మరియు ప్రాంతీయ ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రస్తావించారు.నితిన్ గడ్కరీ తో జాతీయ రహదారుల విస్తరణ,గ్రామీణ రహదారుల అభివృద్ధి మరియు ప్రాజెక్టుల ఆమోదం గురించి చర్చించారు.ధర్మేంద్ర ప్రధాన్ తో అంబేద్కర్ శిక్షణ కేంద్రాలు,పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి మరియు మహిళా సాధికారత పథకాలు వంటి విద్యా రంగ సమస్యలపై చర్చలు జరిపారు.తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్రం పూర్తి సహకారం అందించాలని వంశీ విజ్ఞప్తి చేశారు.కేంద్ర మంత్రులు ఈ అంశాలపై చర్యలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version