ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గెలుపు

ఖమ్మంలో అభిమానులు కేక్ కటింగ్ తో సంబరాలు

ఖమ్మం, నేటి ధాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధించడం హర్షించదగ్గ విషయమని పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఎ. మల్లికార్జున్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎ.మల్లికార్జున్ నాయుడు మాట్లాడుతూ. ఏ అధికారం లేనప్పుడే ప్రజలకు అనేక సేవలు అందించిన ఘనత పవన్ కళ్యాణ్ కు ఉందని కొనియాడారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తారని లేదంటే కాలర్ పట్టుకుని నిలదియమని స్వయానా పవన్ కళ్యాణ్ చెప్పడంతోనే తన నిబద్ధతను చాటుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన జనసేన సైనికులు, కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.చంద్రయ్య, ఎస్. వెంకన్న, వి. శ్రీనివాస్, పి.కోటి, ఏ. శ్రీనివాస్, సురేష్, డి.శేఖర్, సదాశివం దామోదర్ రెడ్డి, మరియు పెవిలియన్ గ్రౌండ్ నందు కరాటే కోచింగ్ తీసుకుంటున్న చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version