ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అనుకోకుండా వచ్చిన గాలి వర్షానికి తడిసి ముద్దయ్యారు.స్టేషన్లో ప్లాట్ ఫాం పై ఉన్న ఒక్క పాత షేడ్ ఉరుస్తుండడం తో ఎలాంటి షేడ్ లు లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని,కనీసం ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి పోత్కపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం నుతన షెడ్లు,మరియు తాగు నీరు, టాయిలెట్ లు నిర్మించాలని కోరారు.