క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్ట పరచాలి.

ఎం సిపిఐ యు కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రజా వ్యతిరేక అనువాద పాలకులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలను సిద్ధం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అందుకు పార్టీ శాఖలను పటిష్ట పరచాలని ఎంసిపిఐయు కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి దామ సాంబయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం మనువాద భావజాలాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని పోరాడే వ్యక్తులను శక్తులను నియంతృత్వ ధోరణితో తప్పుడు కేసులు పెట్టి నిర్బంధానికి గురి చేసి మళ్లీ గద్దెనెక్కెందుకు ప్రజలను మభ్యపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుందని మత రాజకీయాలకు పాల్పడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టి మత రాజకీయాలు చేస్తున్న మతోన్మాది బిజెపి పార్టీనీ గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అలాగే ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలను ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేనియెడల గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర నాయకులు నాగేల్లి కొమురయ్య, కుసుంబా బాబురావు, కన్నం వెంకన్న, డివిజన్ నాయకులు జన్ను రమేష్, మార్త నాగరాజు, కర్నే సాంబయ్య, నాగేల్లి వెంకటేష్, ఏసేభ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version