రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.

*ఎమ్మెల్యేను కలిసిన పార్టీ నాయకులు-ప్రజాప్రతినిధులు

శాయంపేట నేటి ధాత్రి:

కేసీఆర్ ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నిలిచిన భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి నేడు భూపాలపల్లి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సన్మానించిన శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దకోడేపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకులు,మాజీ మార్కెట్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, వసంతపూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర అనూష ప్రేమ్ సాగర్, పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడిశెట్టి సదానందం ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గండ్ర రమణారెడ్డి గెలుపుకై కృషి చేస్తామని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి సమిష్టిగా ముందుకు సాగి గండ్ర రమణన్న విజయంలో ముందుంటామని తెలియజేశారు. కెసిఆర్ సంక్షేమ- అభివృద్ధి ఫలాలను, ప్రజల్లోకి తీసుకు వెళ్తూ
మరోమారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గెలుపుకై కృషి చేస్తామని తెలియజేశారు.నియోజకవర్గస్థాయిలో శాయంపేట మండలాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత గండ్ర దంపతులకు చెల్లుతుందని, వారి గెలుపుకై నాయకులు కార్యకర్తలు కంకణ బద్ధులై ముందుకు సాగుతామని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version