చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల రైతులకు విజ్ఞప్తి,
చందుర్తి మండలం లో రోడ్లకు ఇరువైపుల వరి ధాన్యం పోయకూడదని చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ G. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇలా రోడ్డుకి ఇరువైపులా ఆరబోసిన వరి ధాన్యంతో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పొందారు, కావున ఇలాంటి చర్యలు మళ్లీ పునరవృతం కాకుండా ఉండటానికి మండల రెవెన్యూ అధికారులు సూచించిన స్థలంలో వరి ధాన్యం ఆరబోయాలని సూచించారు. చందుర్తి నుండి గోవిందారం వెళ్లే మార్గంలో ఆరబోసిన వరి కుప్పలను ఎమ్మార్వో తో పాటు చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు సందర్శించి రైతులకు తగిన సూచనలు చేశారు. కావున ఇట్టి విజ్ఞప్తి ని అతిక్రమించి ఎవరైనా రోడ్లకు ఇరువైపుల వరి ధాన్యం పోసినచో చట్టారీత్యా చర్యలు తీసుకోబడును అని జి వెంకటేశ్వర్లు చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు