వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా జూన్ 4న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోమార్కెట్ యార్డులో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విధులు కేటాయించిన అధికారులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తహసిల్దార్, ఉప తహశీల్దార్లను ఆదేశించారు.
గురువారం ఉదయం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ, సలహాలు, సూచనలు ఇచ్చారు.అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో పూర్తి చేయాలని అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్డీఓ పద్మావతి, తహశీల్దార్లు రమేష్ రెడ్డి, ఆర్. పాండు నాయక్, శ్రీనివాస్, మదన్ మోహన్ , ఉప తహశీల్దార్లు ఇతర సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
