చేర్యాల నేటిధాత్రి..
చేర్యాల పట్టణానికి ఇటీవల మంజూరైన మున్సిఫ్ కోర్ట్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం సూర్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, సిద్దిపేట జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీందర్ , సూపరిడెంట్ శ్రీధర్ చేర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూమిగారి మనోహర్, జనరల్ సెక్రెటరీ తాటికొండ ప్రణీత్, సాంస్కృతిక మరియు క్రీడాల సెక్రటరీ అంకని సురెందర్, కోశాధికారి పొన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.