నర్సంపేట,నేటిధాత్రి :
ఈ నెల 30 న నిర్వహించ నున్న పోలింగ్ నిర్వహణలో బాగంగా శనివారం సాధారణ ఖర్చుల అబ్జర్వర్ అమిత్ ప్రతాప్ సింగ్ నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప గుడి వద్ద ఉన్న ఎస్ఎస్టి చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలో ఎస్ఎస్టి టీమ్ లు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీ చేస్తున్న ప్రతి వాహనాన్ని వీడియో లో చిత్రీకరించాలన్నారు.ఎన్నికలు పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంతంగా జరుగుటకు ఎంసిసి టీo పని చేయాలని సూచించారు.
తనిఖీ చేసేటప్పుడు ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఎస్టి టీం మెంబెర్స్ కు తగు సూచనలు చేశారు.
అనంతరం నర్సంపేట ఆర్వో కార్యాలయం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆర్వో కృష్ణవేణి ఎన్నికల నిర్వహణ తగు ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సమీక్షలో పోలీసు అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సహాయ ఖర్చుల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతిఒక్కరూ తుచ తప్పకుండా పాటిస్తూ, గత ఎన్నికల లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గతం ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండాతగు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత రిటర్నింగ్ అధికారికి తగు సూచనలు ఇచ్చారు.
ఎన్నికల ఖర్చుల నివేదికలు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు నివేదికలు సమర్పించాలని సహాయ ఖర్చుల అధికారి శ్రీనివాస్ కు తగు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ సమావేశంలో ఎసిపి తిరుమల, ఎఆర్వో విశ్వ ప్రసాద్, సిఐలు కిషన్,రవీందర్ , ఏఎఫ్ఓ శ్రీనివాస్ లు సంబంధిత అధికారులు ఉన్నారు.