రామకృష్ణాపూర్,మార్చి 22, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఏ జోన్ పోచమ్మ బస్తి అంగన్వాడి సెంటర్ లో శుక్రవారం పోషణ పక్షం నిర్వహించారు. అంగన్వాడి సూపర్వైజర్ సరిత పోషణ పక్షం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం అన్న ప్రసన్న చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. చిన్నపిల్లలకు మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలని అన్నారు. ప్రతినెల అంగన్వాడి సెంటర్లో పిల్లల గ్రూప్ తప్పక చూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శారద, ఆశా వర్కర్ జ్యోతి, ఆయా లావణ్య, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.