నూకల నరేష్ రెడ్డి అందరివాడు ఎంపీ రవిచంద్ర

బిఆర్ఎస్ నాయకులతో కలిసి నివాళులు

Date 15/10/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు,సత్యవతి రాథోడ్,రెడ్యానాయక్ తదితర ప్రముఖులతో కలిసి దివంగత నేత నూకల నరేష్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు

అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నరేష్ రెడ్డి దశదిన కర్మకాండ మంగళవారం ఆయన స్వగ్రామం మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెంలో జరిగింది

ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్,మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకరరావు సత్యవతి రాథోడ్,రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితర ప్రముఖులతో పాటు నరేష్ రెడ్డి చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు

నరేష్ రెడ్డి కుమారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించారు,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు

అలాగే, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,పెద్ది సుదర్శన్ రెడ్డి,రసమయి బాలకిషన్,మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి,అంగోతు బింధు తదితరులు నరేష్ రెడ్డి చిత్రపటానికి పూలుజల్లి నివాళులర్పించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version