బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో బారాస పార్టీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు పర్లపెల్లి వేణుగోపాల్ పై ఇటీవల పెట్టిన అవిశ్వాస తీర్మానం సభ్యులు హాజరు కాకపోవడంతో బుధవారం వీగిపోయింది.సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంతో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ చాకచక్యంగా వ్యవహరించి తన పదవిని నిలబెట్టుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పై వచ్చిన అవిశ్వాసం పై ఆర్డీవో మధుసూదన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల ఎంపీటీసీ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం విగిపోయినట్లు ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జయశీల, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.