సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవే పత్రికలు

మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15
సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవే పత్రికలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ కేసరి దిన పత్రిక క్యాలెండర్ ను ఆయన మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీడియా ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం తెలుసుకొని, పరిష్కార మార్గాలను చూపే జర్నలిస్టులు అంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కేసరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వేముల మహేందర్ గౌడ్, మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య, మనం రిపోర్టర్ వేముల కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరబాటి మాతాజీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version