కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఇటీవలే నూతనంగా ఓటు హక్కు పొందిన సుమారు 40మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు బీజేపీ కి చెందిన యువ నాయకుడు ఇప్పపూల గణేష్ బి.ఆర్.ఎస్ పార్టీలో చేరాడు. బుధవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ మొట్టమొదటి సరిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న తాము, తమ ఓటును వృధా చేయకుండా అభివృద్ధి చేయాలనే ఆశయంతో, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న విద్యావేత్త, సేవ దృక్పథం కలిగిన వ్యక్తి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కే వేస్తామని ఏకగ్రీవంగా అంగీకరించారు. అట్లాగే తాము ఓటు వేయడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇతరులు కూడా కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరే లత- మహేందర్, ఉప సర్పంచ్ జవ్వాజి అంజయ్య, కుంట బాలరాజు, ఎదురుగట్ల అజయ్, కుంట అజయ్, రాము, బాలకిషన్, మహేందర్, మహేష్, గణేష్, వెంకటేష్, ప్రశాంత్, శేఖర్, రాజు, రాహుల్, శివ, మహేష్, గణేష్, రాజు, ఆదర్శ్, అంజి, భరత్, నరేందర్, హరీష్, ఆదర్శ్, ప్రశాంత్, జెలెందర్, కిషోర్, భాను, ఆది, రవితేజ, కన్నయ్య,ఆది తదితరులు పాల్గొన్నారు.