లక్ష్మి నరసింహ స్వామి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన సిహెచ్ నరసింహ, జె సుధాకర్

కాప్రా నేటిధాత్రి జూలై 15:

చర్లపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం చీప్ అడ్ వైజర్, కాలనీ పెద్దలు ముకుంద భరత్ సాగర్ సమక్షంలో నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అధ్యక్షులు గా సిహెచ్ నరసింహ, జనరల్ సెక్రటరీగా జె సుధాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ చారి, కనకయ్య, శ్రీధర్, కోశాధికారిగా శ్రీనివాస్ చారి, దామోదర్, కె మల్లేష్, అడ్ వైజర్స్ గా గోపాల్ రెడ్డి, రాజయ్య, ఎస్ కృష్ణ,పాండు, జాయింట్ సెక్రటరీస్ గా ఎం సంతోష్, లింగస్వామి, తిరుమల రావు, పరమేష్ చారి, కమిటీ మెంబర్స్ గా పి రవి, టి ప్రవీణ్, బి లక్ష్మీనారాయణ, ఎన్ సురేష్, కె సురేష్ సాగర్, రామచందర్, శివ, సత్యనారాయణ, కిరణ్ కుమార్ యాదవ్, డాక్టర్ శ్రీను, కె అరుణ్ కుమార్, వి శ్రీనివాస్, కె తిరుమలేష్, మాదేశ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఎల్లవేళలా కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ, అధికారులను, ప్రజా ప్రతినిధులను కాలనీలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి కాలనీ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version