డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి

ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను బాధితులకు వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది…గత ప్రభుత్వంలోనే లబ్ధిదారులను గుర్తించి వారికి లాటరీ సిస్టంలో డ్రా తీసి రూములు అలాట్మెంట్ చేసి రూమ్ నంబర్స్ కూడా కేటాయించడం జరిగింది… ఇది జరిగిన అనంతరం ఎన్నికల కోడ్ రావడం వల్ల బాధితులకు పట్టాలు అందలేదని తెలిపారు…అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పుడు కేటాయించిన లబ్ధిదారులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు వారికి అనుకూలించిన వారికి ఇవ్వడం కోసం కుట్ర పన్ని స్థానిక ఎమ్మెల్యే కమిషనర్ వాటిని అలాగే ఎవరికి కేటాయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారని ఆయన తెలియజేశారు… అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ… వాటిని అలాగే ఎవరికి కేటాయించకుండా ఉండడం వల్ల అవి అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని,, అక్కడ ఉన్న సామాగ్రి ఇతరత్రా సామానులు అన్ని చోరీకి గురికాపడుతున్నాయని తెలిపారు…బేషరతుగా గత ప్రభుత్వంలో గుర్తించిన పేద లబ్ధిదారులకు తిరిగి ఆ డబల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది… లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలసి వచ్చిన సంఘాలను కూడగట్టుకొని డబల్ బెడ్ రూమ్ బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణిగుంట్ల మహేష్ జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి నియోజకవర్గ ఇన్చార్జి నితిన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version